in

I was tired of doing glamor roles, says samantha!

తాజాగా మరోసారి తన కెరీర్, రోల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సామ్. పాన్ ఇండియా లెవల్లో ఫాలోయింగ్ అందుకున్ సమంత ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవల ఓ హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. వెబ్ సిరీస్ చేయాలన్న ఆలోచన అప్పటివరకు లేదు. కానీ రాజ్, డీకే నా ఆలోచనల్లో మార్పులు తెచ్చారు.

కుదరదు అని చెప్పకూడదని నిర్ణయించుకున్నా.. రాజీ పాత్రకు నేను ఊహించినదానికంటే ఎక్కువే అబినందనలు దక్కాయి. ఈ సిరీస్ తో కొత్త సవాళ్లను స్వీకరించగలననే నమ్మకం ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చింది. అలాగే గ్లామర్ పాత్రల గురించి స్పందిస్తూ ఇప్పటివరకు అందానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి అలసిపోయాను. ఇక పై రోల్స్ చేయడానికి నేను సమర్ధురాలిని కాదని నమ్ముతున్నా.

నటిగా ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది సామ్. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకు మంచి గుర్తింపు లభించిందని.. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచన చేయలేదని.. గత రెండేళ్లలో పరిస్థితులలో చాలా మార్పులొచ్చాయని తెలిపింది. ప్రస్తుతం సమంత యశోద సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తోంది.

tanya hope at zee apsara awards red carpet!

best comebacks of tollywood heroes in 2021!