in

Huge increase in jhanvi Kapoor’s fees for telugu movies!

జాన్వీ కపూర్‌ ‘దేవర’ చిత్రంతో తెలుగు చిత్ర సీమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఈ నెల 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, జాన్వీ కపూర్‌ ఈ చిత్రంతో పాటు  రామ్‌చరణ్‌ సరసన కూడా ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలోనే ఈ చిత్రం కూడా సెట్స్‌ మీదకు కూడా వెళ్లనుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో కొనసాగే పీరియాడికల్‌ డ్రామాగా రూపొందనుంది..

ఇక ఈ రెండు చిత్రాలతోనే జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ అగ్రహీరోయిన్‌ జాబితాలో చేరిపోయారు. దేవర ప్రమోషనల్‌ కంటెంట్‌ ద్వారా ఈమె క్రేజ్‌ మరింత పెరిగింది. దీంతో జాన్వీ తన పారితోషికాన్ని పెంచేసిందని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. హీరో నాని-శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం కోసం నిర్మాతలు జాన్వీని హీరోయిన్‌గా అనుకున్నారట. అయితే ఆమె పారితోషికం తెలుసుకున్న వాళ్లు ఆ ఆలోచనను విరమించుకుని, మరో హీరోయిన్‌ అన్వేషణలో ఉన్నారని తెలిసింది..!!

The Mystery of Moksha Island!