in

gopichand’s ‘Aaradugula Bullet’ gears up for release after 5 years!

గోపీచంద్, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి.గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. దాదాపు ఐదేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆర్థికపరమైన కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు సమస్యలు పరిష్కారం కావడంతో ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. కరోనా ప్రభావంతో మూతపడ్డ థియేటర్స్‌ రీ ఓపెన్‌ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలిగిపోయినట్టు ఈ సినిమా నిర్మాత తాండ్ర రమేష్ తెలిపారు. ఈ సినిమా విడుదలకు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ కూడా తొలిగిపోయినట్టు చెప్పారు. అంతేకాదు థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ సినిమాను నిర్మాత తాండ్ర రమేష్ సొంతంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ ను స్టార్ట్‌ చేసి.. విడుదల తేదీ వంటి విషయాలపై పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.

Nandamuri Balakrishna set to romance f2 girl Mehreen pirzada?

MAA PRESIDENT POST: it’s VISHNU MANCHU VS PRAKASH RAJ