
అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం రోజురోజుకూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది. ఈ సినిమా కాస్టింగ్ గురించి వస్తున్న తాజా అప్డేట్ ప్రకారం, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఈ ప్రాజెక్టులో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో దీపికా పదుకోన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ మరియు జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, అనుష్క శర్మ చేరికతో ఈ సినిమాలోని ఐదవ కథానాయికగా ఆమె నిలవనుంది. చాలా ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న అనుష్కకు ఇది ఒక పవర్ఫుల్ కమ్బ్యాక్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి..!!
