in

adivi sesh comments on ghmc elections!

ప్రస్తుతం మేజర్ అనే సినిమాలో నటిస్తున్న శేష్.. పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు గూఢచారి 2 సన్నాహాలు చేస్తున్నాడు. మేజర్ చిత్రాన్ని గూఢచారి ఫేం శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల గురించి కాకుండా ఊరు పర్యావరణం ఎన్నికలు అంటూ శేష్ చేసిన కామెంట్ వేడెక్కిస్తోంది. “ఓటు అనేది ఎప్పుడూ ఎంతో ముఖ్యమైనది.

హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న వాతావరణానికి ఇంకొంచెం అభివృద్ధి జరిగితే బాగుంటుంది.  మణికొండలాంటి ప్రాంతాల్లో మాటిమాటికీ బోర్లు వేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న గ్రౌండ్ వాటర్ ని ఎక్కువగా తోడేస్తున్నాం.. అంతేకాదు.. భారీ నిర్మాణాలు సిమెంటు రోడ్లతో ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ లోని పర్యావరణాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి“ అని అన్నారు.

thapsi shocking comments on heroes wives!

I will never marry in my life, says tejaswi!