in

aamani sensational comments on akkineni akhil!

డాదిన్నర వయసులోనే సిసింద్రీ సినిమాతో బుల్లి స్టార్ అయిపోయిన అఖిల్ అప్పట్లో బాలతారగా సంచలనం సృష్టించాడు. నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. అంతేకాదు.. ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ కూడా చేశాడు నాగార్జున. ఈ సినిమాలో అఖిల్ తల్లి పాత్రలో నటించిన ఆమని తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే.. ఇప్పుడు ఆమని అసలు విషయం చెప్పేసింది. సిసింద్రీ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు పాతికేళ్ల తర్వాత ఆమని, అఖిల్ కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నటిస్తున్నారు. చిన్నప్పుడు ఎత్తుకొని ముద్దాడిన అఖిల్ ని ఇప్పుడు కండలు తిరిగిన హీరోగా చూస్తుంటే.. తన సొంత కొడుకును చూసినట్టే అనిపిస్తుందని ఆమని ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది. అఖిల్ కూడా తనను తల్లిలాగే చూస్తాడని.. తన సొంత తల్లికి ఇచ్చినంత గౌరవం ఇస్తాడని చెప్పింది అఖిల్.

అయితే.. సిసింద్రీ సినిమా చేసినప్పుడు అఖిల్ చాలా చిన్న పిల్లోడు. అప్పటికి అఖిల్ కి ఊహ లేదు. పెరిగి పెద్దైన తర్వాత సిసింద్రీ సినిమా చూసి తన పట్ల ప్రేమ, అభిమానం పెంచుకున్నాడంటోంది ఆమని. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ సమయంలో అఖిల్ తన మీద చూపించిన ప్రేమకు, గౌరవానికి రెండు కండ్లు చెమర్చాయని.. సెట్ లోకి రాగానే.. వెతుక్కుంటూ వచ్చి అమ్మా అని పిలిచి నాతో పాటే ఉండిపోయేవాడని చెమర్చిన కండ్లతో చెప్పింది ఆమని.

Nootokka Jillala Andagadu!

Actress Adah Sharma New Portfolio Stills!