
కన్నడ చిత్రసీమ నుంచి ప్రయాణం మొదలుపెట్టి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన రష్మిక మందన్న, తాజాగా దేశంలోనే నంబర్ 1 హీరోయిన్గా నిలిచారు. ఇటీవల వెలువడిన జాతీయ స్థాయి పాప్యులారిటీ ర్యాంకింగ్లో, బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొణెను వెనక్కి నెట్టి రష్మిక ఈ ఘనత సాధించినట్లు తెలుస్తోంది. ఇది ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది.
‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో ఆమె పోషించిన శ్రీవల్లి పాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘యానిమల్’ సినిమాతో హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇటీవల విడుదలైన ‘పుష్ప 2: ది రూల్’ ఆమె మాస్ ఇమేజ్ను, క్రేజ్ను శిఖర స్థాయికి చేర్చింది. దీంతో పాటు ‘ఛావా’, ‘కుబేర’ వంటి విభిన్న భాషల చిత్రాలతో తన నటనను, ఉనికిని అన్ని పరిశ్రమలలోనూ బలంగా చాటుకున్నారు..!!

