
ఈసినిమా ప్రమోషన్స్లో భాగంగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తొలుత ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ చెల్లెలు అనుకున్నామని ఆయన తెలిపారు. జాన్వీ కపూర్ కంటే ముందే ఈ సినిమా కథను ఖుషీ కపూర్కు వినిపించానని డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పుకొచ్చారు. నా కథకు ముందుగా ఖుషీ కపూర్ను హీరోయిన్గా అనుకున్నాని ఆయన వెల్లడించారు..అయితే హీరో రామ్చరణ్ పక్కన ఖుషీ చిన్నపిల్లలా అనిపించి.. హీరోయిన్గా ఆమెను తప్పించినట్లు వెల్లడించారు. ఆమె స్థానంలో ఖుషీ సోదరి జాన్వీ ను ఎంపిక చేశామని బుచ్చిబాబు తెలిపారు. అయితే చెల్లెల్ని కాదని అక్కను హీరోయిన్గా ఎంపిక చేసింనందుకు తాను ఏమైనా ఫీల్ అయ్యారా అని సినిమా షూటింగ్లో జాన్వీని బుచ్చిబాబు పదే పదే అడిగేవారట. ఇప్పటికీ దాని వల్ల తనలో తాను మదనపడుతున్నట్లు వెల్లడించారు..!!
