in

manchu lakshmi reveals about crazy things with rakul!

తాజాగా ఆహా భోజనంబు అంటూ మంచు లక్ష్మి కుకింగ్ షో ను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే తన స్నేహితురాలు రకుల్ తో మంచు లక్ష్మి షో చేయగా.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో షో చేసింది. వచ్చిరాని వంటలతో ఆనంద్ దేవరకొండ చేసిన ఫన్నీ జిమ్మిక్స్ తో సరదాగా సాగే ఈ ఎపిసోడ్ లో మంచు లక్ష్మి తన ప్రాణ స్నేహితురాలితో కలిసి ఇష్టమైన ఫుడ్ కోసం ఏమేమి చేసేవారో చెప్పి.. ఎప్పటిలానే అందరిని ఎంటర్టైన్ చేసింది మంచు లక్ష్మి.

ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడి బెస్ట్ ఫుడ్ కోసం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి అడుగుతామంటూ మొన్న విశ్వక్ సేన్ తో జరిగిన ఎపిసోడ్ లో పేల్చిన బాంబు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. మంచు లక్ష్మికి భోజనం వివరాలు తెలిపేందుకే ప్రజాప్రతినిధులు ఉన్నారా అంటూ తెగ కామెడీ మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఇది మరువకముందే మరో ఆణిముత్యాన్ని సంధించారు మంచు లక్ష్మి అంటూ ఆనంద్ దేవరకొండ ఎపిసోడ్ చూసిన నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మిలు మంచి భోజన ప్రియులు. ఇద్దరు ప్రాణ స్నేహితులు కావటంతో కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు. రకుల్ హీరోయిన్ కావటంతో ఫిజిక్ మెయింటైన్ చేయటం కోసం ఎక్కువగా తినకపోయినా.. జస్ట్ టేస్ట్ చేసే అలవాటుంది. కానీ మంచు లక్ష్మి అలా కాదట. కడుపు నిండా తిని, అరిగేదాకా వ్యాయామాలు చేస్తుందట.  దీంతో వీరిద్దరూ ఫుడ్ కోసం విమానాలు ఎక్కిమరీ తిరిగిన విషయాన్నీ రివీల్ చేసి.. మీమర్స్ కి సరికొత్త కంటెంట్ ని ప్రసాదించింది.

Jr NTR becomes first Indian to own Lamborghini Urus Graphite!

malvika mohan Feels Naked Without A Mask!