in

anushka shetty to pair up with naveen polishetty!

తాజాగా అమ్మడి తాజా సినిమాకు సంబంధించిన వార్తలు సినీ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అనుష్క తదుపరి సినిమాలో యంగ్ హీరోతో రొమాన్స్ చేయనున్నారంట. అది కూడా ఎవరో కాదండి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయగా అందరినీ అలరించి ఇప్పుడు జాతి రత్నంగా మన ముందుకు వస్తున్న నవీన్ పోలిశెట్టి. ఈ మేరకు వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారంట. ఈ చిత్రం 40 సంవత్సరాల మహిళకు 25 సంవత్సరాల కుర్రాడికి మధ్య సాగే ప్రేమకథగా టాక్ నడుస్తోంది.

ఇప్పటివరకు ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలపై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే నవీన్ ప్రస్తుతం తన తాజా సినిమా జాతి రత్నాలు రిలీజ్ పరంగా బిజీగా ఉన్నారు. జాతి రత్నాలు సినిమాను అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇందులో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Anupama’s mother reacts to wedding rumours of her daughter!

sai chand gari peru venaka unna asalu rahasyam!